నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక దేశ, దశ దిశను మార్చే అనేక నిర్ణయాలను ఇట్టే తీసుకున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సమాజ శ్రేయస్సు నిర్ణయాలు ఈ వరుసలో కీలకంగా నిలిచాయి.
పథకాలు..
వన్ నేషన్ వన్ సబ్ స్ర్కిప్షన్ (2025– డిజిటల్ లైబ్రరీ), పీఎం విశ్వకర్మ (2023–చేతివృత్తులకు ప్రోత్సాహం), అమృత్ భారత్ స్టేషన్ (2023–రైల్వే స్టేషన్ల అభివృద్ధి), పీఎం ఈబస్ సేవ (2023–పట్టణ రవాణా), మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (2023–మహిళలు, బాలికల ఆర్థిక బలోపేతం), అగ్నిపథ్ (2022–రక్షణ శాఖ బలోపేతం), పీఎం పోషణ్ శక్తి నిర్మాణ్ అభియాన్ (2021–ఆరోగ్యం విద్య), స్టార్స్ (2020–పాఠశాల విద్యను మెరుగుపర్చడం–సమగ్రశిక్షాభియాన్), పీఎం స్వామిత్ర యోజన (2020–ఆస్తుల మ్యాపింగ్), గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ (2020–ఉపాధి), పీఎం మత్స్య సంపద యోజన (2020–మత్స్యపరిశ్రమ, కార్మికులు, యాజమానులకు ప్రోత్సాహం), పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (2019–రైతులకు నగదు బదిలీ), పీఎం జల్ జీవన్ మిషన్ (2019–గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, కుళాయిల ద్వారా ప్రతీ ఇంటికి నీరందించడం), అటల్ భుగర్భ జల్ (2019– నీటి సమస్యలకు చెక్ పెట్టడం, భూగర్భ జలాలను పెంచడం), పీఎం కిసాన్ ఊర్జా (2019–రైతులకు విద్యుత్ పంపిణీ), పీఎం శ్రమ యోగి మంథన్ (2019–అసంఘిత రంగానికి సామాజిక భద్రత), పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (2018–వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధతు ధర కల్పించడం), ఆయుష్మాన్ భారత్ యోజన (2018–ఉచిత వైద్యం, ఆరోగ్య సంరక్షణ), పీఎం సమగ్ర శిక్షాభియాన్ (2018– అంగన్ వాడీ విద్య నుంచి 2వ తరగతి వరకు ఉచిత విద్య), పీఎం జన్ వికాస్ (2018– ప్రజాభివృద్ధి), పీఎం రాష్ర్టీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (2018– గ్రామీణాభివృద్ధి), ఖేలో ఇండియా (2017–క్రీడలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి), పీఎం సౌభాగ్య యోజన (2017– అన్ని ఇళ్లకు విద్యుత్), పీఎం క్రిష్ణోన్నతి యోజన (2017–వ్యవసాయాభివృద్ధి), పీఎం మాతృవందన యోజన ((2017–గర్భీణీలు, శిశువులకు ఉచిత వైద్యం, ప్రోత్సాహకం), డిజిటల్ చెల్లింపు, మౌలిక సదుపాయాలు (2016–యూపీఐ, రూపే, ఫాస్టాగ్ డిజిటల్ లావాదేవీలపై ప్రోత్సాహం), పీఎం ఉజ్వల యోజన (2016–ఉచిత ఎల్పీజీ గ్యాస్), పీఎం ఉడాన్ (2016–మెరుగైన విమాన కనెక్టివిటిని అందించడం), పీఎం ఫసల బీమా యోజన (2016–రైతుల పంటలకు బీమా), స్టాండ్ అప్ ఇండియా (2016– గ్రీన్ ఫీల్డ్ రుణాలు), జాతీయ జలవిద్యుత్ (2016–నీటి ప్రాజెక్టుల అభివృద్ధి), స్టార్టప్ ఇండియా (2016–స్టార్టప్ లకు ప్రోత్సాహం), ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (2015– వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదల), పీఎం ముద్ర యోజన (2015– వ్యాపారాలకు రుణాలు), డిజిటల్ ఇండియా (2015–ఐటీని ప్రభుత్వ సేవల్లో సద్వినియోగం చేసుకోవడం), ఫేమ్ ఇండియా (2015– రవాణా, ఇంధన భద్రత), పీఎం గ్రామీణ ఆవాస్ యోజన (2016–గృహ నిర్మాణం), పీఎం ఆవాస్ యోజన (2015–పట్టణ గృహ నిర్మాణ పథకం), అటల్ పెన్షన్ యోజన (2015–ప్రతీ ఒక్కరికి నిర్ధిష్ట వయస్సు తరువాత పెన్షన్), పీఎం సురక్ష బీమా యోజన (2015–బీమా పథకం), పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన (2015–జీవిత బీమా), ఉన్నత్ జ్యోతి బై అఫర్డబుల్ – ఉజాలా (2015–ఫ్లోరోసెంట్ ల్యాంప్ ల పంపిణీ), పీఎం కౌశల్ వికాస్ యోజన (2015– నైపుణ్యాభివృద్ధి), హృదయ్ (2015– పట్టణాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం), సుకన్య సమృద్ధి యోజన (2015–ఆడపిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా), పీఎం భారతీయ జన్ ఔషధి కేంద్ర (2015–తక్కువ ధరలోనే జనరిక్ మందులు), దీన్ దయాళ్ అంత్యోదయ యోజన (2015–నైపుణ్యాభివృద్ధి), నేషనల్ కెరీర్ సర్వీస్ (2015–ఉపాధి, ఉద్యోగ కల్పన వేదిక), దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (2015– గ్రామీణ గృహాలకు విద్యుత్ సదుపాయం), అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ – అమృత్ (2015–వరదల నివారణ), స్వచ్ఛ భారత్ అభియాన్ (2014– మెరుగైన పారిశుద్ధ్యం), ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (2014–ప్రతీ ఒక్కరిని బ్యాంకుల ద్వారా ముడిపెట్టడం, ప్రయోజనాలను కల్పించడం), దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (2014–యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పన), నమామి గంగే (2014–గంగానదిని శుభ్రపర్చడం). ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమాలే గాకుండా అంతకుముందు ప్రజాసంక్షేమం దృష్ట్యా ప్రారంభించిన అనేక కార్యక్రమాల నియమ నిబంధనలను కూడా ప్రజలకు ఉపయోగపడేలా సరళీకృతం చేశారు. ఇందుకోసం లక్షలాది కోట్లను కాదు.. కోటాను కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నారు.
పీఎం మోదీకి లభించిన అత్యున్నత పురస్కారాలు..
కింగ్ అబ్దుల్లాజీజ్ అల్ సౌద్ ఆజ్ఞ (2016–సౌదీ అరేబియా), స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ (2016–ఆఫ్ఘానిస్థాన్), పాలస్తీనా స్టేట్ గ్రాండ్ కాలర్ (2018–పాలస్తీనా), నిషాన్ ఇజ్జుద్దీన్ (2019–మాల్దీవులు), జాయెద్ ఆర్డర్ (2019–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసాన్స్ (2019–బహ్రెయిన్), లెజియన్ ఆఫ్ మెరిట్ (2020–యునైటెడ్ స్టేట్స్), ఆర్డర్ ఆఫ్ ఫిజి (2023–ఫిజి), పాపువా న్యూ గినియా (2023–పాపువా న్యూ గినియా), ఆర్డర్ ఆఫ్ ది నైల్ (2023–ఈజిప్ట్), లెజియన్ ఆఫ్ ఆనర్ (2023–ఫ్రాన్స్), ఆర్డర్ ఆఫ్ ఆనర్ (2023–గ్రీస్), ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ (2024–భూటాన్), ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ (2024–రష్యా), గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ (2024–నైజీరియా), డొమినికా గౌరవ పురస్కారం (2024–డొమినికా), ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గయానా (2024–గయానా), ముబారక్ అల్ కబీర్ ఆర్డర్ (2024–కువైట్), ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్ (2025–బార్బడోస్), గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది హిందూ మహాసముద్రం (2025–మారిషస్), శ్రీలంక మిత్ర విభూషణ (2025–శ్రీలంక), గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ –3 ( 2025–సైప్రస్), ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా (2025–ఘనా), ట్రినిడాడ్, టొబాగో రిపబ్లిక్ ఆర్డర్ (2025–ట్రినిడాడ్, టొబాగో), నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ గ్రాండ్ కాలర్ (2025–బ్రెజిల్), అత్యంత పురాతన వెల్విట్షియా మిరాబిలిస్ క్రమం (2025–నమీబియా).
అంతర్జాతీయ ఎన్జీవో అవార్డులు..
ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు (2018–ఐక్యరాజ్యసమితి), సియోల్ శాంతి బహుమతి (2018–సియోల్ సాంస్కృతిక ఫౌండేషన్), గ్లోబల్ గోల్ కీపర్స్ అవార్డు (2019–బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్), ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు (2019–ప్రపంచ మార్కెటింగ్ సమ్మిట్), గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ (2021– కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్), ఎబాకల్ అవార్డు (2024), లోకమాన్య తిలక్ అవార్డు (2023–లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్), మైనార్టీ అభ్యున్నతికి డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డ్ (2024–వాషింగటన్ అడ్వెంటిస్ట్ యూనిర్సిటీ),
సంయుక్త అవార్డులు..
అబుజా (నైజీరియా)– 2024
జార్జ్టౌన్ (గయానా)– 2024
హూస్టన్ (యూఎస్ఎ)– 2019
ఖాట్మాండు (నేపాల్)– 2018
ఇతర అవార్డులు..
టైమ్ మ్యాగజైన్ కవర్ (ప్రపంచ అత్యంత శక్తివంతమైన వ్యక్తి), ఫోర్బ్స్ (శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చోటు).
అత్యంత గుర్తింపు పొందిన నాయకుడు..
– 2025 మధ్య నాటికి 27 విదేశీ గౌరవాలను అందుకున్న మోడీ అంతర్జాతీయంగా అత్యంత గుర్తింపు పొందిన భారత ప్రధానమంత్రి.
– భారతదేశం ప్రపంచ దౌత్యపరమైన పరిధిని ప్రదర్శించే ఆఫ్రికా, అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల నుంచి ఆయనకు గౌరవాలు లభించాయి.
– ఆయన తరచుగా తన అవార్డులను భారతదేశంలోని 1.4 బిలియన్ పౌరులకు అంకితం చేస్తారు. ఇది సమ్మిళిత నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
– ట్రినిడాడ్, టొబాగో, నమీబియా వంటి విదేశీ గౌరవాలను అందుకున్న మొదటి భారత ప్రధాన మంత్రి.