డిజిటల్​ మోసాల్లో భారతీయులే సమిధలు

తప్పించుకుంటున్న అసలు నిందితులు

Oct 29, 2024 - 16:27
 0
డిజిటల్​ మోసాల్లో భారతీయులే సమిధలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: డిజిటల్​ అరెస్టులలో భారత్​ నుంచి విదేశాలకు వెళ్లిన భారతీయులే సమిధలుగా మారుతున్నారు. ఈ కేసుల్లో వారినే ఉచ్చులోకి ఇరికిస్తున్న విదేశీ శక్తులు తప్పించుకుంటున్నాయి. ఈ విషయాన్ని భారత్ కు చెందిన పలు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. కాంబోడియా, దుబాయ్​ కేంద్రంగా ఆర్థిక మోసాల ద్వారా నగదును విత్​ డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. మయన్మార్​, కాంబోడియా, వియత్నాం, లావోస్​ లలో ఈ నెట్​ వర్క్​ వెలుగులోకొచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లిన భారతీయులనే డిజిటల్​ మోసాలకు ఎంచుకుంటున్నారు. దీంతో నిందితులుగా భారతీయులే చిక్కుతున్నారు తప్ప అసలు నిందితులు తప్పించుకుంటున్నారు. పోలీసులని, ఇన్వెస్టిగేషన్​ అని, బహుమతులు అని, లక్కీ డ్రాలు, కొరియర్​ లు, రేషన్​ కార్డులు, బ్యాంకు అధికారులు, ప్రభుత్వ పథకాల పేరిట అనేక రకాలుగా డిజిటల్​ మోసాలకు తెరలేపుతున్నట్లు అధికారులు గుర్తించారు.