ఆసియా మహిళా హాకీలో భారత్ విజయఢంకా
India triumphed in Asian women's hockey
ముచ్చటగా మూడోసారి ట్రోఫీ కైవసం
1–0 తేడాతో డ్రాగన్ ఓటమి
జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన స్టేడియం
పాట్నా: మహిళల ఆసియా హాఈ ఛాంపియ్ షిప్ లో డ్రాగన్ ను భారత్ మట్టి కరిపించింది. బుధవారం సాయంత్రం బిహార్ రాజ్ గిర్లో జరిగిన ఈ మ్యాచ్ లో 1–0 తేడాతో చైనాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమయ్యాక 31వ నిమిషంలో దీపిక బృందం తొలి గోల్ ను చేసింది. తొలి, రెండో క్వార్టర్స్ లో ఇరు జట్లు ఎలాంటి గోల్స్ సాధించలేకపోయాయి. రెండో క్వార్టర్ లో భారత్ 4, చైనాకు 2 పెనాల్టీ కార్నల్ లు లభించాయి. రెండు జట్లు కూడా పెనాల్టీ కార్నర్ లను సద్వినియోగం చేసుకోలేకపోయాయి. రెండో క్వార్టర్ మొదలైన మరు నిమిషంలోనే భారత్ గోల్ సాధించింది. దీంతో స్టేడియం అంతా జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగిపోయింది.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా చూసుకుంటే మూడోసారి ట్రోఫీని గెలుచుకుంది. అంతకుముందు 2023లో రాంచీలో, 2016లో సింగపూర్లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది.
గ్రూప్ మ్యాచ్ లు..
11 నవంబర్ మలేషియాను 4–0తేడాతో భారత్ ఓడించింది.
12 నవంబర్ సౌత్ కొరియా 3–2 తేడాతో ఓడించింది.
14 నవంబర్ థాయ్ లాండ్ ను 13–0తో ఓడించింది.
16 నవంబర్ చైనాను 3–0తో ఓడించింది.
17 నవంబర్ జపాన్ ను 3–0తేడాతో ఓడించింది.
సెమీఫైనల్..
19 నవంబర్ జపాన్ ను 2–0 తేడాతో ఓడించింది.
ఫైనల్..
20 నవంబర్..
చైనాను 1–0తేడాతో భారత్ పరాజయం పాలు చేసింది.