గాజాలో ఐడీఎఫ్ విధ్వంసం.. 50 మంది మృతి
IDF destruction in Gaza.. 50 people died
గాజా సిటీ: గాజాలో ఐడీఎఫ్ తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది. ట్రంప్ హెచ్చరికను సైతం బేఖాతరు చేసి హమాస్ ఇజ్రాయెల్ బందీలలో ఇద్దరినీ చంపడంతో ఐడీఎఫ్ దాడులను తీవ్రతరం చేసింది. గురువారం చేసిన దాడిలో 50 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ దాడి ఖాన్ యూనిస్ పై జరిగింది. ఈ దాడిలో 8మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు కూడా మృతిచెందారు. ఐడీఎఫ్ దాడితో అల్ అక్సా, నాసర్ లో ఆసుపత్రులను మూసివేశారు. దాడులను ఆపేందుకు ఖతార్ యూఏఇ విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఇజ్రాయెల్ మంత్రి గిడియాన్ తో కలిసి కాల్పుల విరమణపై చర్చించారు. బందీల విడుదలపై హమాస్ మొండిగా వ్యవహరిస్తూ ఇద్దరినీ చంపడమే ఇజ్రాయెల్ లో మరింత ఆగ్రహానికి కారణమైన దాడులకు పాల్పడింది. ఐడీఎఫ్ దాడులతో యూఎన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆసుపత్రులపై దాడులు మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. ఉద్దేశ్యపూర్వకంగా దాడులు చేయొద్దని స్పష్టం చేసింది. గాజాలో ఇప్పటివరకు 27 ఆసుపత్రులు, 12 వైద్య సదుపాయాలు అందజేస్తున్న భవనాలపై 136 దాడులు జరిగాయని యూఎన్ పేర్కొంది.