వెస్​ బ్యాంక్​ లో ఐడీఎఫ్​ దాడులు 10మంది మృతి

40 మందికి గాయాలు

Jan 22, 2025 - 18:14
 0
వెస్​ బ్యాంక్​ లో ఐడీఎఫ్​ దాడులు 10మంది మృతి

జెరూసలెం: ఐడీఎఫ్​ వెస్ట్​ బ్యాంక్​ లో భారీ దాడికి పాల్పడింది. ఈ దాడిలో పదిమంది పాలస్తీనియన్లు మృతి చెందారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన మూడు రోజుల్లోనే ఈ దాడి జరగడం పట్ల అంతర్జాతీయ సమాజం ఉలిక్కి పడింది. మంగళవారం ఈ దాడి జరిగినట్లుగా బుధవారం వెస్ట్​ బ్యాంక్​ అధికారులు ప్రకటించారు. దాడిలో గాయపడ్డ 40మంది వైద్య సేవలకు ప్రతిబంధకాలను ఐడీఎఫ్​ సృష్టిస్తోందని ఆరోపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడింది. దాడి తరువాత ఐడీఎఫ్​ చర్యలపై పాలస్తీయన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాగా మృతుల్లో ఓ బాలుడు కూడా ఉండడంతో స్థానికులు భారీ ఎత్తున ఐడీఎఫ్​ సైన్యం చర్యలపై నిరసన చేపట్టారు. కాగా ఐడీఎఫ్​ వరుస దాడులు ఇంటలిజెన్స్​ సమాచారంతోనే జరిగినట్లుగా ఐడీఎఫ్​ ప్రకటించింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని ఇవి భవిష్యత్​ లో ఇజ్రాయెల్​ కు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉన్నందున తాము ఉపేక్షించేది లేదని ఐడీఎఫ్​ తేల్చి చెప్పింది. ఐడీఎఫ్​ దాడి నిర్వహించిన జెనిన్​ వెస్ట్​ బ్యాంక్​ ప్రాంతం పాలస్తీనా సాయుధ సమూహాలకు బలమైన కోటగా పరిగణించబడుతుంది.