మాజీ సీఎం బాదల్ పై కాల్పులు తృటిలో తప్పిన ముప్పు
Firing on former CM Badal was a threat that narrowly missed
నిందితునికి దేహశుద్ధి పోలీసులకు అప్పగింత
నారాయన్ సింగ్ కు ఖలిస్థానీ గ్రూపులతో సంబంధం
చండీగఢ్: మాజీ సీఎం, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్ పై దాడి జరిగింది. అమృత్ సర్ లో గేటు వద్ద విధులు నిర్వహిస్తుండగా బుధవారం ఉదయం ఆయనపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది అతన్ని పట్టుకొని చేతిలోని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు.
హఠాత్ పరిణామంతో స్వర్ణ దేవాలయం వద్ద ఆందోళన వ్యక్తమైంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిందితుడు బాదల్ పై కాల్పులకు తెగబడుతుండగా ఆయన భద్రతా సిబ్బంది నిందితుడిని అడ్డుకోవడంతో గాలిలో కాల్పులు జరిగాయి. దీంతో ఆయన క్షేమంగా ఉన్నారు. నిందితుడిని నారాయణ్ సింగ్ చైరాగా పోలీసులు గుర్తించారు. ఇతనికి ఖలిస్థానీ గ్రూపులతో కూడా సంబంధాలున్నాయని అన్నారు. 1984లో పాక్ వెళ్లి అక్కడి నుంచి పెద్ద యెత్తున పంజాబ్ కు ఆయుధాలు, పేలుడు పదార్థాలను అక్రమ రవాణా చేసేవాడన్నారు. బుదైల్ జైల్ నుంచి తప్పించుకున్న కేసులో నిందితుడన్నారు. పంజాబ్ జైలులో శిక్ష కూడా అనుభవించాడని పోలీసులు తెలిపారు. ఇతనిపై ఉపా చట్టంపై కూడా కేసులు నమోదయ్యాయన్నారు.
గుర్ముత్ సింగ్ రామ్ రహీమ్ కు అనుగుణంగా వ్యవహరించారన్న ఆరోపణలపై బాదల్ కు సిక్కు మత సంస్థ శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ శిక్ష విధించింది. ఈ శిక్షను తాను భగవంతుని శిక్షగా తాను స్వీకరిస్తున్నట్లు సుఖ్భీందర్ బాదల్ తెలిపారు. ఈ నేపథ్యంలో అమృత్ సర్ లోని దేవాలయం బయట గేటు వద్ద రెండో రోజు విధులు నిర్వహిస్తుండగా నిందితుడు నారాయణ్ సింగ్ కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో బాదల్ తృటిలో తప్పించుకున్నారు.