మహా నిరీక్షణకు తెర సీఎంగా ఫడ్నవీస్
శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక
ముంబాయి: ఎట్టకేలకు 11 రోజుల నిరీక్షణకు తెరపడింది. మహారాష్ర్ట ముఖ్యమంత్రిగా సీఎం ఫడ్నవీస్ ఎంపికయ్యారు. బుధవారం బీజేపీ కేంద్ర పరిశీలకులు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీలతోపాటు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభా పక్ష నేతగా బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగంటివార్ లు ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించారు. పంకజా మొండే సమర్థించారు. ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు.
డిప్యూటీ సీఎం పదవికి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ల పేర్లు ఖరారైనట్లు సమాచారం. మహాయుతి ఎమ్మెల్యేల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, ఇద్దరు డిప్యూటీ సీఎంలు గవర్నర్ను మధ్యాహ్నం 3 గంటలకు కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేయనున్నారు.
డిసెంబర్ 5 గురువారం ఆజాద్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఎట్టకేలకు మహా సీఎం పదవి పీఠముడి వీడడంలో ఇక మహారాష్ర్టలో రాజకీయ టెన్షన్ కు తెరపడినట్లయ్యింది.