చత్తీస్​ గఢ్​ లో కూలిన చిమ్ని.. శిథిలాల కింద 25 మంది 

Chimney collapsed in Chattisgarh.. 25 people under the rubble

Jan 9, 2025 - 18:37
 0
చత్తీస్​ గఢ్​ లో కూలిన చిమ్ని.. శిథిలాల కింద 25 మంది 

పెద్ద ఎత్తున రంగంలోకి రెస్క్యూ బృందాలు

రాయ్​ పూర్​: చత్తీస్​ గఢ్​ ముంగేలి జిల్లా నిర్మాణంలో ఉన్న కుసుమ ప్లాంట్​ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సంస్థలో భారీ చిమ్నీ కూలిపోయి 25 మంది దాని కింద చిక్కుకున్నారు. గురువారం ఈ ఘటన ముంగేలి జిల్లాలోని సర్గాల్​ రాంబోడ్​ లో జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు గ్రామస్థులతో కలిసి రెస్క్యూ చర్యలు చేపట్టి అధికారులకు సమాచారాన్ని అందజేశారు. పలువురు గాయపడ్డవారిని శిథిలాల నుంచి రక్షించి బిలాస్​ పూర్​ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ పైప్​ లైన్​ నిర్మాణం సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఎంతమంది మృతి చెందారన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. విషయం తెలుసుకున్న అధికారులు బిలాస్​ పూర్​, పెండ్రా, రాయ్​ ఘర్​, జంజ్​ గిర్​ చంపా జిల్లాల నుంచి విపత్తు, నిర్వహణ బృందాలు భారీ ఎత్తున రెస్క్యూ చర్యలు చేపట్టారు. ప్రమాదంపై సర్గావ్​ పోలీసులు కేసు నమోదు చేపట్టినట్లు ఎస్పీ భోజరాజ్​ పటేల్ విచారణ చేపట్టారు. ఈ ప్లాంట్​ లో ఇనుప పైపులు తయారు చేస్తుంటారని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో కూలీలంతా భోజనం చేస్తున్నట్లు తెలిపారు.