119మంది అక్రమ వలసదారులు వెనక్కు
అమెరికా నుంచి ఫిబ్రవరి 16న భారత్ కు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అమెరికా నుంచి భారత అక్రమ వలసదారులతో మరో విమానం రాబోతుంది. ఫిబ్రవరి 15న 119మంది తో ఈ విమానం అమృత్ సర్ కు చేరుకోనుందని శుక్రవారం అధికార వర్గాలు వెల్లడించాయి. అక్రమ వలసదారుల విషయంలో భారత్ స్పష్టమైన విధానంతో ఉందని మోదీ–ట్రంప్ లు ప్రకటించిన నేపథ్యంలో ఇకపై అమెరికా అక్రమ భారతీయ వలసలను నిరోధించనున్నారు. గతంలో కూడా 104 మంది భారత్ కు పంపించారు. అమెరికా వ్యాప్తంగా అక్రమంగా ఉంటున్న వారిలో భారతీయులు 20వేల మంది ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల పార్లమెంట్ లోనూ ఈ అంశాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ లేవనెత్తారు. అక్రమ వలసదారులను అమెరికా వెనక్కుపంపడం ఇదే తొలిసారి కాదని, గత పదేళ్ల రికార్డులను వెల్లడించారు. అమెరికా కేవలం అక్రమంగా నివసిస్తున్న భారతీయులను మాత్రమే వెనక్కుపంపడం లేదని, అన్ని దేశాల వారిని వెనక్కి పంపిందని చెప్పారు.
............